Tuesday, October 18, 2022

దీపావళి పండుగ - టపాసులు

 ప్రదర్శనలొద్దు 

     **************


ఇది ఒక్కే రోజు కాలుష్యం !

మనిషి అవసరాలు నిత్య కాలుష్యం !!


బరాబర్ మినిమమ్ 3000 వేల 

రూపాయల క్రాకర్స్ కొంటా!


పొల్యూషన్ ఆపాలంటే

నీ కార్ అమ్మేసి, సైకిల్ కొనుక్కో !


నీ బైక్ అమ్మేసి, నడుచుకుంటూ పో !


ఫ్యాక్టరీలు తీసేసి, కార్మికులకి ఉపాధివ్వు !


షాపింగ్కెళ్లి, బట్టలు చేతిలో పట్టుకొని ఇంటికి రా !


కూరగాయలు

మీ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కోటి 

సొరకాయ ఒకడు

పొట్లకాయ ఒకడు

వంకాయలు ఒకరు

మిరపకాయలు కొందరు

మోసుకు రండి !

క్యారీబాగ్ వద్దు !!


సెల్ ఫోన్ వాడకండి, పిట్టలు సచ్చిపోతున్నాయ్ !


కరెంట్ బహిష్కరించండి, మొన్న గబ్బిలం వేలాడింది శవమై !!


బల్బు వాడకండి, పురుగులు సచ్చిపోతాయ్ !


సచ్చినప్పుడు శవం ముందు, పెళ్ళైనప్పుడు జంట ముందు, పేల్చకండి !


అవే డబ్బులతో పేదవారికి

సహాయం చేయమంటావా!


అయితే నీ బర్త్డే party డబ్బులు

ఇచ్చెయ్ !


పిజ్జా ఎందుకు అన్నం తింటావ్ గా

ఆ డబ్బులిచ్చేయ్ !!


ఫ్యాన్ ఉందిగా

AC ఎందుకు

ఆ డబ్బులిచ్చేయ్ !!


కుండ ఉందిగా

ఫ్రిజ్ ఎందుకు

అది అమ్మి ఇచ్చేయ్ !!


అప్పుడు నేను మానేస్తా!


అప్పటి దాకా బరాబర్ టపాకాయలు

కాలుస్తా !!


ఇది ఒక్కే రోజు కాలుష్యం

మనిషి అవసరాలు నిత్య కాలుష్యం !!


దయచేసి "విజ్ఞాన ప్రదర్శనలొద్దు"

అమాయకులకి గమనిక :


ఒక్కరోజు దీపావళి రోజున బాణాసంచా కాల్చడం ఆపితే కాలుష్యం తగ్గదు, ఆగదు


ఎందుకంటే, కాలుష్యం కి ప్రధాన కారణం దీపావళి కాదు !!


దయచేసి దీపావళి వల్ల కాలుష్యం అని కామెడీ ఆపండి, 

హిందువులారా మేలుకోండి !

ప్రతి రోజు రాత్రవగానే వీధి కుక్కలు ఎలా మొరుగుతాయో అలాగే ప్రతి సంవత్సరం దీపావళి రాగానే కుహనా కుక్కలు మొరగడం పరిపాటైపోయింది.


కాని వీధి కుక్కలు మొరగడంలో కారణాలుంటాయి. అలికిడులకి తెలియని వారొచ్చినా మొరుగుతాయి.


కాని ఈ కుహనా కుక్కలు మాత్రం ఏ కారణం లేకపోయినా పని కట్టుకొని కేవలం హిందూత్వ ద్వేషంతో మొరుగుతుంటాయి.


హిందువులు సంబరంగా జరుపుకునే దీపావళి అనగానే భూమి మీద ఉండే ప్రకృతిని అంతా ఈ కుహనాగాళ్ళే కాపాడుతున్నట్టు జనాభా మీద దేశం మీద ఇంకా చెప్పాలంటే ప్రపంచం మీద భూమి గురించి ప్రకృతి గురించి ఎక్కడలేని ప్రేమలు ఒలకపోస్తూ పనికిమాలిన జాగ్రత్తలు గుర్తుచేస్తూ....


 దీపావళి పండుగకు కాల్చే టపాసుల కారణంగా వచ్చే పొగ వలన ప్రకృతిలో అనర్దాలేర్పడే ప్రమాదముందట. ఓజోన్ పొరకు చిల్లులు పడతాయట.


దీని గురించి కుహనా కుక్కల భాగమైన విదేశీ తొత్తులు అదే ప్రజా అజ్ఞాన వేదిక వారు టీవి లలో ప్రజలకు పర్యావరణాన్ని పాడుచేయద్దు అని సందేశాలివ్వడం చేస్తున్నారు.


కాని నాకొక అనుమానం అది ఏమిటంటే.....


ఈ కుక్కలకుగాని ప్రజా అజ్ఞాన వేదిక వారికిగాని హిందూ పండగ దీపావళి రోజు కాల్చే టపాసులే కనిపించి వినిపిస్తాయా?


చిమ్మ చీకట్లో అర్ద రాత్రి మద్దెల దరువు అన్నట్లు చలితో అందరూ దుప్పట్లు కప్పుకొని నిద్రించే సమయంలో అదే డిశంబరు 31 రాత్రి సంవత్సరం మారిందని దిక్కుమాలిన సంవత్సరం ప్రారంభమైందని కాల్చె టపాసులు కనపడవా? వినపడవా? ఓహో అది విదేశీ తొత్తులదనా? లేక హిందువులది కాదనా? 


ఇంకా అదే అర్దరాత్రి ఆడ మగ తేడా లేకీండా రోడ్ల మీద తప్పతాగి పడేసిన సీసాలు సగం తిని పారేసే చెత్త చదారం వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు రాదా?


ఒరే కుహనా కుక్కల్లారా! ప్రజా అజ్ఞాన వేదిక ద్వారా దీపావళి నాడు టపాసులు కాల్చద్దు పర్యావరణం కాపాడండి అని అంటున్నారే అసలు దీపావళి పండగ ఎందుకు చేస్తారో మీకు తెలుసా?


అక్టోబరు నెల అనగా మన తెలుగు మాసముల బట్టి ఆశ్వీయుజం అంటే శరద్ ఋతువు వర్షాలు మెండుగాపడే మాసం రానున్నది నవంబరు నెల తెలుగు మాసం కార్తీకం అనగా హేమంత ఋతువు చలి ఎక్కువగా ఉండే మాసం.


ఈ మాసాలు ఋతువుల గురించి అజ్ఞాన వేదిక, కుహనా కుక్కలకు బహుశా పరిచయం ఉండదను కుంటా! ఎందుకంటే విదేశీ తొత్తులు స్వదేశం గురించి పట్టించుకోరు! కనుక హిందూ పండగలలో ఒక్కో పండగకు ఒక్కో సైన్టిఫిక్ రీజన్ ఉంది అందులో ప్రస్తుతం దీపావళి గురించి తెలుసుకోండి.


ఇంతకీ దీపావళీ పండగకి గల సైన్టిఫిక్ రీజన్ ఏంటంటే ---


పైన చెప్పిన ఋతువులలో మార్పువచ్చే సమయంలో అంటే వర్షాకాలం నుండి చలికాలంకు మారే సమయంలో ప్రకృతి వచ్చే మార్పు ల ఆధారంగా చెడు బ్యాక్టీరీయా విస్తరించడం, దోమలు పెరగడం వంటివి ఏక్కువగా జరుగుతుంది.


 మనుషులలో కూడా వ్యాది నిరోదక శక్తి తగ్గే సమయం ఆ సమయంలో చెడు బ్యాక్టీరియా విస్తరణ వల్ల మానవులు వ్యాదుల భారిన పడటం ప్రస్తుతం విస్తరిస్తున్న డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, జ్వరాలు, శ్వాస సంబందిత వ్యాదులు వంటి వాటితో మరణాల సంఖ్య పెరగడం ఎక్కువగా ఈ సమయంలోనే సంభవిస్తుంటాయి.


అలాంటి చెడు బ్యాక్టీరియాని, దోమలను నివారించడానికి మన పెద్దలు పాత కాలంలోనే పురాణాల ఆధారంగా ప్రత్యేకతను ఒనర్చి సాంప్రదాయ పద్దతుల ద్వారా ఆచారాలను పెట్టి వాటిని నేటికీ అమలు జరిగేలా చూశారు. 


ఇంతకీ దీపావళి పండగ నాడు దీపాలు పెట్టి టపాసులెందుకు కాలుస్తాం అంటే -


నువ్వులనూనెతో దీపాల వరుస పెట్టడం వలన మరియు సూర్యకారం, గందకం, నల్లమందు వగైరాలతో తయారు చేసిన టపాసులు కాల్చడం వల్ల వచ్చే పొగ వాసనల వల్ల చెడు బ్యాక్టీరియా, దోమలు నశించడం వల్ల మానవాలికి మేలు జరుగుతుందని ఈ సమయంలో దీపాలు వెలిగించి, టపాసులు కాల్చుకుని పండగ జరుపుకునే ఆచారం అనాదిగా వస్తుంది.


అంతే తప్ప కుహనా వాదులు చెప్పే విధంగా టపాసులు కాల్చితే వాతావరణ కాలుష్యం, ఓజోన్ పొర దెబ్బతినడం లాంటివి ఏమి జరగదు. అవి కెవలం హిందూత్వం మీద ద్వేషంతో చెప్పే మాటలు తప్ప మరేమి కాదు.


కాబట్టి కుహనా కుక్కల మాటలు అజ్ఞాన వేదిక కబుర్లు వినకుండా హిందువులందరూ చక్కగా దీపావళిని సంతోషంగా జరుపుకోవలసినదిగా కోరుకుంటూ.......


#diwali #crackers #Hindu #festival 

Monday, June 20, 2022

ఓ అద్భుతం... నా ఖమ్మం.... Khammam Politics 2014 election result

 

అందరు నన్ను... "నువ్వు, వెరైటి గాడివి నీలో చాలా షేడ్స్ ఉన్నాయి" అంటే ఏమో అనుకున్నా...
అది నా గొప్పతనం కాదు... "నా జిల్లా నీళ్ళ మహిమ".... ఖమ్మం జిల్లా అంట వెరైటీ గాళ్ళు ఈ ఇండియా లోనే ఉండరు...
ఇదిగో చక్కటి ఉదాహరణ జిల్లా ఎన్నికల ఫలితాలు...
కొంచెం దొరతనం,
కొంచెం కులం,
కొంచెం ఆటవికం,
కొంచెం విప్లవం,
కొంచెం అవినీతి,
కొంచెం విశ్వాసం,
మొత్తంగా ఓ అద్భుతం... నా ఖమ్మం....

Monday, June 13, 2022

About My self, సొంత డబ్బా.

గురు బ్రహ్మ ! గురు విష్ణు ! గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైత్ శ్రీ గురవేన్నమః ||
<div class="badge-base LI-profile-badge" data-locale="en_US" data-size="medium" data-theme="dark" data-type="VERTICAL" data-vanity="bhargava-ram-71188563" data-version="v1"><a class="badge-base__link LI-simple-link" href="https://in.linkedin.com/in/bhargava-ram-71188563?trk=profile-badge">Bhargava Ram</a></div>
             
దాదాపు 8 ఏళ్ళ తరువాత నెను "రంగస్థలానికి " చెరువయ్యాను మళ్ళీ, మలిదశ తెలంగాణ ఉద్యమ నేపథ్యంగా....నేను కధానాయకుడిగా,మరియూ దాదాపు 45 మంది కళాకారుల మరియు సాంకేతిక నిపుణులచే 6వ తేది, శనివారం సాయంత్రం 7 గం. లకు రవీంద్రభారతి లో మా "యజ్ఞం" నాటకం తప్పక చూసి, నన్ను ఆశిర్వదించి తెలుగు నాటకాన్ని ఆదరిస్తారని, ఆశిస్తు.. మీ భార్గవ రాం రచన: చిలువేరు రఘురాం, దర్శకత్వం: వెంకట్ గోవాడ... శ్రీకళానికేతన్, హైదరాబాద్ వారి సమర్పణ... అందరికి ఆహ్వానం.....

Bhargava Ram is at Green Park Hotel.
"aagnipoolu" (gemeini 8pm) 1 anniversary ROCKS... v enjoyed a lot... congrats to my team... thanks (Big mam n sir) to giving this opportunity... watch me today :P.

నిజంగానే నన్ను ఉద్దరిస్తూ, భరీస్తూ, (బెదిరిస్తూ)... నా జీవితాన్ని తీర్చి దిద్దుతున్న అన్నయ్య కృపాల్ కాశ్యప్ నకు జన్మదిన శూభాకాంక్షలు...

Bhargava Ram is at Sullurpeta.
Successfully conducted a career oriented workshop for B.tech freshers at Gokul Krishna colg.eng. thanks to SATYA SAI SEVA SAMITI,


Sunday, 10 November 2013 at 09:20 UTC+05:30
telugu tv serials unnantha kalam nuv bdays jarupukuneyyy... undalani..... ne fans association presdnt wahee.....
ఈ దీపావళి దడ దడ లాడిస్తారని ఆశిస్తూ .. HAPPY DIWALI

My friend found my "Black Shade; and Dark part of Me"... చలికి తిరిగి నల్లబడ్డాను అని చెప్పా... :P

i like only two days in ENGLISH DAYS.. 1) mothers day 2) women day { కానీ ఈ 2 రోజులు నేను ఏమి చెయ్యను; నా మనుగడ కు మూలమైన వాళ్ళ కోసం ఒక 2 రోజులు చెప్పుకోవడం తప్పు కాదు }... sorry friends i didn't wish you back on jan 1st, BUT thanks to them who wished me... hardly i can say all the best.. థాంక్ యు..

What a day ..started at 8.am... sundara chaitanya ashramam, dattatreya peetam to, yagas, bhajanas, friends, go maata seva.. meetings, ended at 10pm, iskon temple (sec-bad)... JAI SrI KRISHNA....
<script src="https://platform.linkedin.com/badges/js/profile.js" async defer type="text/javascript"></script>

Monday, November 8, 2021

గుప్తులు *కామసూత్ర* గ్రంథం

భారత దేశాన్ని కాపాడుకున్న హిందు సనాతన ధర్మం, క్రీస్తు పూర్వం 540 నుంచి క్రీస్తు శకం 250 B.C వరకు బౌద్ధ మతం ఈ దేశాన్ని ఆక్రమించింది, బౌద్ధ మతం మొదలైనప్పుడు దేశంలో ఉన్న రాజులు, రాణులు అందరు బాగా ఆధరించడం వల్ల మెజారిటీ మతం అయింది... వైదిక మతం మీద తిరుగుబాటు ఈ బౌద్ధ మతం... అంటే వైదిక మతం లాగా బౌద్ధంలో దేవుడు ఉండదు, వర్ణ వ్యవస్థ ఉండదు, మంత్రాలు ఉండవు, అణిచివేత ఉండదు, ముఖ్యంగా priestly class ఉండదు, నర బలులు, జంతు బలులు లాంటి cruel inhuman rituals ఉండవు, క్లుప్తంగా చెప్పాలంటే బౌద్ధ మతం live and let live లాంటి humanism, ఒక నాస్తిక ఉద్యమం, నాస్తిక సమాజం దాని లక్ష్యం, సమానత్వం దాని ముఖ్య సూత్రం... రాను రాను రాజు గుఱ్ఱం గాడిద అయినట్టు, బౌద్ధ మతంలోకి దేవుడు వచ్చాడు, కట్టు కథలు వచ్చాయి, మంత్రాలు వచ్చాయి, బౌద్ధ మతం మూడు రకాలుగా విడిపోయింది 1.మహాయాన బౌద్ధం 2. హీనయన బౌద్ధం 3.వజ్రయన బౌద్ధం 4. నవయన బౌద్ధం(బాబా సాహెబ్ స్థాపించింది 1956) ఇందులో ముఖ్యంగా south east nations అన్నింటిలో ఈరోజుకి బతికి ఉన్న బౌద్ధం మహాయాన... శ్రీలంకలో ఉన్నది హీనయన (అసలైన బౌద్ధం) వజ్రయన మనకు టిబెట్ లో మాత్రమే కనిపిస్తుంది...


 

అసలు విషయానికి వస్తే బౌద్ధ ధర్మంలో ముఖ్యమైన అంశం కోరికలను త్యజించి జీవించడం, సన్యాసం తీసుకోవడం, బౌద్ధ మతం వల్ల ప్రజల జీవితాలు నిసారంగా మారిపోతున్న సమయంలో ఈ దేశాన్ని పాలిస్తున్న గుప్తులు *కామసూత్ర* గ్రంధాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు, వాస్తవానికి దీని ఉదేశం ప్రజలను monastic life నుంచి physical worldly pleasures వైపుకు మళ్లించడం... కామసూత్రని వాత్స్యాయనుడు రాసాడు అంటారు కానీ కామసూత్ర కకోక శాస్త్ర రెండు గ్రంధాలు రాయడానికి చాలా సంవత్సరాల రీసెర్చ్ చేసి, ఎన్నో ఎక్సపెరిమెంట్స్ చేసి, వారి అనుభవాలను ఒక గ్రంధంగా క్రోడీకరించారు...

గుప్తుల కాలాన్ని స్వర్ణ యుగంగా చరిత్ర కారులు అభివర్ణిస్తారు... వారి కాలంలో వాస్తవానికి హిందు మతం వర్ణ వ్యవస్థ రెండు బాగా బలపడిపోయాయి... మనిషి కోరికల చుట్టు తన జీవితాన్ని ఏర్పర్చుకున్నాడు... జైన బౌద్ధ మతంలో ఈ ఇహపరమైన సౌఖ్యలు, సుఖాలు ఉండవు...మనిషి అంటేనే కోరికలు, కోపాలు, దుఃఖలు కదా...!!!

కామసూత్ర వల్ల హిందు మత పునర్జీవనానికి గుప్తులు పూనుకున్నారు... ఈ రోజు ఈ కామసూత్ర గ్రంథం మన దేశంలో తప్ప 75 western countries లో వీక్లీ పత్రికల్లో సెక్స్ ఎడ్యుకేషన్ కోసం అచ్చు అవుతుంది... మన యువకులేమో వారు చేసే పోర్న్ ఇండస్ట్రీ మీద ఆధారపడుతున్నారు...

 


శాతవాహన వంశంలోని కుంతల శతకర్ని ఈ కామసూత్ర బంగిమల్ని ఎక్సపెరిమెంట్స్ చేసి తన భార్యను చంపేశాడు...

భారత దేశంలో పుట్టిన బౌద్ధం, అతి పెద్ద మతం ఒక్కపుడు కానీ ఈరోజు musem లో మాత్రమే కనిపిస్తుంది అంటే చాలా కారణాలు ఉన్నాయి కానీ కామసూత్ర కొట్టిన దెబ్బ చాలా గట్టిది...
---source book "the wonder that was india"-- అనువాద కర్త -వశిష్ట భార్గవ

Sunday, July 18, 2021

ఇది నలంద విశ్వవిద్యాలయం

ఇది నలంద విశ్వవిద్యాలయం యొక్క శిథిలాలు, క్రీస్తు పుట్టక ముందు 500 సంవత్సరాల క్రితం, భారత దేశంలో వెలిసిన గొప్ప విద్య కేంద్రం... గౌతమ బుద్ధుడు కూడా దీన్ని సందర్శించడం దానికి ఉన్న ప్రత్యేకత... ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు ఆ రోజుల్లో వచ్చి చదువుకునే వారు...
1st బోర్డింగ్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ...

మళ్ళీ చెప్తున్న ఈ విద్య కేంద్రం క్రీస్తు పుట్టక ముందు 500 సంవత్సరాల క్రితం...

ఇస్లాం అనే మతం పుట్టకముందు 1250 సంవత్సరాల క్రితం... విరాజిల్లిన ఈ విశ్వవిద్యాలయాన్ని, భారత దేశ సంపద దోచుకోవడానికి వచ్చిన అరబ్, టర్కిష్ దండయాత్రలకు బలి అయింది... (నన్ను తిట్టుకోకండి, ఇస్లాం దండయాత్రలు ఇక్కడ సోషల్ సర్వీస్ చేయడానికి జరగలేదు, గుళ్లలో ఉన్న సంపద దోచుకోడానికి మాత్రమే)

ఐతే ఏంటి, 12వ శతాబ్దంలో భారత దేశం మీద ముస్లింల దండయాత్ర జరిగినప్పుడు క్కుతుబ్ ఉద్దీన్ ఇబాక్ సేనాని మొహమ్మద్ భక్తియర్ ఖిల్జీ ఈ విద్య కేంద్రాన్ని, దానితో పాటు విక్రమశిలా, ఒడంటిపూరి విశ్వవిద్యాలయాల ను కాల్చివేసాడు... ఇది నేను చెప్తున్న విషయం కాదు... Tabaqat-i-nisiri, minhaj-i-siraj   అనే గ్రంధాలు చెప్తున్నాయి
నలంద విశ్వవిద్యాలయం ప్రత్యేకత దాని లైబ్రరీ... ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రరీ అది దాన్ని తగలబెడుతే కొన్ని నెలల పాటు తగలబడింది(మరి ఎందుకు ఈ విద్య కేంద్రాలను నేల మట్టం చేసారు అంటారు...??





source book "the wonder that was india"- అనువాద కర్త -వశిష్ట భార్గవ

Tuesday, November 19, 2019

ABOUT TELANGANA NEWS & Views అప్పటి మాధ్యమాల గోల..

All non supporters of telangana... kindly watch facts by prof. jayashakar, he is the only person 1952 nijams movement to 2010 telagana... if possible read his books also.. u understand the facts.. just leave this political crap..

ప్రత్యేక తెలంగాణా ,ప్రత్యేక ఆంద్రా , ప్రత్యేక సీమాంద్రా , ప్రత్యేక రాయల తెలంగాణా... ఏమిటి ఇదంతా అసలు ప్రత్యేక అనేపదాన్ని అంతర్జాల మిత్రుడివి అయిన నీకు వాడాలి . ఈ సోషల్ నెట్వర్క్స్ లో స్నేహ పరిమళాన్ని అలా రాతలతో, ఫోటోలతో ,లైకుతో,షేరులతో అద్భుతం గా వెదజల్లుతున్నావే, కులం, మతం , ప్రాంతం , వర్గం ఇలా ఎల్లలు లేని అంతర్జాల స్నేహన్ని అందించావే ! కృతజ్ఞాతాభినందనలు. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు .-- Krupal Kasyap

ఏం జరుగుతుంది ఈ రాష్ట్రం లో...
తెలంగాణాది 50 సంవత్సరాల చరిత్ర అన్నారు, అన్యాయం జరిగిందని, ప్రజల కాంక్ష అని దాదాపు అన్ని పార్టిలు ప్రచారం చెసాయి, టి.అర్.ఏస్ ఎకంగా పార్టియె పెట్టింది, పార్టీ పెట్టి దాదాపు 12 సంవత్సరాలు అవుతోంది, వెళ్లని ఎందుకు పెట్టారు ? మీ పరిస్తితి ఏంటి అని ఏ నాయకుడు ఇన్నియేళ్ళు అడగలేదు, కట్ చేస్తే అదికార పక్షం ఒక 4 సంవత్సరాలు నాంచి నాంచి ఏదో నిర్ణయం తీసుకుంది, ఇంత జాప్యం వలన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, పరిశ్రమలు,( like royal en field, nano cars, real estates and IT MNC's) అన్నీ కోల్పోయామ్... నాకు అర్ధం కానిది ఏంటంటే 50+12+4 66 యేళ్ళుగా ఇక్కడి జనాలు తెలంగాణ, తెలంగాణ అని మొత్తుకుంటుంటే "ఇప్పటిదాకా ఈ సీమాంధ్ర నాయకులు ఏం చేశారు", చూపులు అయ్యి, లగ్గాలు పెట్టుకొని శుభలేఖలు పంచి, రేపు పెళ్లి అనగా ఇప్పుడు అడ్డం తిరగడం ఏం న్యాయమో మీరే ఆలోచించండి.!

మొన్ననే ఒక నిజం తెలిసింది, నా ఫ్రెండ్ ఒకడు ఫేక్ ప్రొఫైల్ క్రేట్ చేసి నాకు request పంపాడు; తెలిసిన తరువాత ఎందుకు అలచేస్తున్నావ్ అని అడిగాను, దిమ్మ తిరిగే answer చెప్పాడు. ఫేస్బుక్ లో ఎవరిని ఎమ్మన్నా abusing కేసులూ, దాని పైన కొట్లాటాలు, యే ఉద్యమానికైనా సపోర్ట్ చేద్దామ్మంటే ఫ్రెండ్స్ తో రిలేషన్స్ దెబ్బ తింటున్నాయంట; రోడ్డు ఎక్కితే లాటి చార్జీలు తప్పటం లేదు; వాడి భావాన్ని, వాక్ స్వాత్రంత్రాన్ని తెలపటం కోసం క్రియేట్ చేసుకున్నాడంట... :P

వివిధ భాషల ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు వెర్వేరు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగ విడిపోయినప్పటి నుండి ఏ టి.వి చూసినా , ఏ పత్రిక చదివినా రెండు తెలుగురాష్ట్రాల అభివ్రుధ్ధే మా లక్ష్యం అని వివిధ రాజకీయ పార్టీల నాయకులు వివిధ ప్రాంత స్వలాభపరులు మాట్లాడటము గమనిస్తున్నాము. ఈ రకమైన అభిప్రాయాలను వ్యక్తము చేయటములో ఏమైన వేషధారణ వుందా? లేక వాస్తవంగ రెండు తెలుగు రాష్ట్రాల అభివ్రుధ్ధి మనసా వాచా కోరుకూంటున్నారా! ఈ రకమైన వ్యాఖ్యలు చూస్తుంటే ఒక తెలుగు రాష్ట్రాలే రెండు గా చీలిపోయినవా మనదేశములో ఎన్నొ రాష్ట్రాలు రెండుగా అంతకంటే ఎక్కువగా, ఒ క భాష మాట్లాడేవారు విడిపోలేదా. ఈ రెండు రాష్ట్రాలలో కేవలం తెలుగు వారే వున్నారా లేక ఆంధ్రులే వున్నారా! వేరే ఇతర మాత్రుభాషలు మట్లాడే వారు లేరా! ఒక్క నిముషము ఆలోచించాలి. తెలుగు భాష మట్లాడే వాళ్ళు ఈ రెండు రాష్ట్రాళ్ళ్స్లొనే వున్నారా, వేరే రాష్ట్రాళ్ళో లేరా? వుంటే వాళ్ళ అభివ్రుధ్ధిని ఎందుకు కాంక్షిచటము లేదు అనే అనుమానాలు ప్రజల మనసుళ్ళో మెదులుతుంటుంది. ఒక కులాన్ని, ప్రాంతాన్ని ఎంతో వివక్షతతో చూస్తున్నామే. తెలుగు మట్లాడే ఈ రెండు రాష్ట్రాల్లొ వేరే భాష మట్లాడే వారిని ఎంత ప్రేమ, ఆదరణగ చూడగలుగుతారు. వుదాహరణకు, ఒకసామాజిక వర్గముకు చెందిన పోలీసు అధికారి నక్సలైట్ కాల్పులల్లొ చనిపోతే ఎంతఏమాత్రం ఆలశ్యము చేయకుండ వెనువెంటనే యస్.ఆర్.నగర్ కూడలిలో ఆ అధికారి విగ్రహాన్ని ప్రతిష్టింప చేశారు . ఇతనికంటే ముందు యల్ .బి.నగర్ స్టేడియం లో ఆ నక్సలైట్ల కాల్పులల్లొ చనిపోతే అప్పుడున్న ముఖ్యమంత్రి గాని తరువాత వచ్చిన ముఖ్యమంత్రులుగాని హత్యకు గురైన పోలీస్ అధికారి విగ్రహాన్ని నేటివరకు తెలంగాణా లోగాని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో గాని నేటి వరకు ప్రతిష్టించే ఏర్పాటు చేయలేదు. ఇటువంటివారికి తెలుగువారి అభివ్రుధ్ధి గురించి మాట్లాడే హక్కు వుందా!.తెల్లవారితే, టి.వి.చానల్ తెలుగువారి సమశ్యలంటూ రెండు రాష్ట్రాల గురించి కలిపి చర్చలు పెడతారు. రాష్ట్రాలు విడిపొయినతరువాత రెండూ తెలుగురాష్ట్రాలకు వెర్వేరుగ చర్చలు జర్పవచ్చు, ఎందుకు జరపటము లేదో ఆశ్చర్యముగా వుంది. ఇంతకు ముందు రెండుగ విడిపోయిన మధ్యప్రదేశ్ గాని , బీహార్ లల్లో గాని ఎక్కడా కూడ పదే,పదే రెండు నాలుగు, ఆరు హిందీ రాష్ట్రాలు అని వుచ్చరించటము లేదు. ఎవరి రాష్ట్రము వారిదే. భొపాల్, చత్త్థీస్గడ్ , ఉత్త్థరప్రదేశ్,ఉత్థరాఖండ్ రాష్ట్రాలు అని అంటున్నారు. ఎవరి టి.వి చ్చానల్శ వారివి, ఎవరి పత్రికలు వారివి. అందువలన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగానే పరిగణించాలే తప్ప పదే పదే రెండు తెలుగురాష్ట్రాలు అనుకుంటూ ఒకరి నష్టం కొరుకుంటూ తన లాభాలనే పరిగణనలోకి తీసుకుంటూ ప్రజలని మోసం చేయటము ఎంతవరకు సమంజసము. ప్రజలను మభ్యపెట్టటానికి విభజన తరువాత ఎంతో నష్టపోయినాము అని నొక్కి వక్కానించి, నాయకులు మట్లాడి ప్రజలమనసులను దోచుకొని కేంద్రం నుండి లాభాలు పొంది తెలంగాణాకు అన్యాము చేయాలని చూస్తున్నారు.పదవిలోవున్నప్పుడు ఇదే నాయకులు తెలంగాణాకు ఎంత అన్యాయము చేసి రాష్ట్ర విభజనకు కారకులమయ్యాము అని చెప్పలేకపోతున్నారు. విడిపోతున్నదని తెలిసినా తమకు ఏమి కావాలో అడగకుందా విభజనకు అడ్డుపడి నష్టపోయేటట్లు చేసే ఈ నాయకులను ప్రజలు ఎందుకు విశ్వసిస్తున్నారో అర్థముకాని విషయం. విభజనతో నష్టపోయినప్పుడు, సమైక్యముగా వున్నప్పుడు ఎంత లాభ పెట్టారో కూడ ప్ర్జజలకు అర్థమయ్యెటట్టు ఇదే నాయకులు చెప్పాలి కదా, ఎందుకు నచ్చచెప్పటము లేదు. మనభారత దేశములో సుమారు పది కోట్ల తెలుగు మాట్లాడే ప్రజలున్నారు. అంటే రెండుకోట్ల తెలుగు ప్రజానీకం వేరే రాష్ట్రాలలో వున్నారన్నమాట. రెండు తెలుగురాష్త్ట్రాలు అనే ఈ నాయకులు వేరే రాష్ట్రాలలో వున్న తెలుగు వారి క్షేమం గురించి పట్టించుకోరా ! భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో రాష్ట్రాలని 1953,1956 లో విభజించినప్పుడు ఆయా రాష్ట్రాల లో మట్లాడే ప్రజలకు, భాషలకు తీరని అన్యాయము జరిగింది. తద్వార ఎన్నొ భాషలకు ఈ దేశము లో వెరే రాష్ట్రాల భాషలకు పోషణ లేకుండ పోయింది. ఎన్నో పాఠశాలలు, కాలేజులు మూతపడ్డాయి . అన్ని భాషలవాళ్ళు,అన్ని ప్రాంతాలలో అన్ని రాష్ట్రాలళ్ళో వుంటే భాషకు బ్రతుకు వుంటుంది. ఆ విధముగ చేయకపోవటము వలన కొన్ని భాషలకు సరియైన ఆదరణ లేకుండ పోతున్నది. వాటిలో ముఖ్యముగ దెబ్బతిన్నది తెలుగు భాష.. మాత్రుభాషను ఇంట్లొ గూడా మాట్లాడుకోలేని పరిస్తితి వుంది . ఈ పరిస్తితిని అధిగమించటానికి ప్రత్యేకమైన చర్చ జరగవలసివున్నది. భాషకోసం పడిచస్తున్నట్టుగ చెప్పుకునేవాళ్ళకు ఇంకో విషయాన్ని ఙప్తికి తేవాలనుకుంటున్నాను. 1972 లో ఒక తెలంగాణా ప్రాంతానికి చెందిన తెలుగు ముఖ్యమంత్రి భూసంస్కరణలను పట్టుదలతో అమలుపరచి అట్టడుగు వర్గాలవారికి న్యాయం చేయాలని సంకల్పించినప్పుడు, ఆ ముఖ్యమంత్రిని దింపటానికి ఆంధ్ర ప్రాంత రెండు పెద్ద సామాజికవర్గాలవారు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమమాన్ని నాటకీయముగ చేసి సామాన్యమానవులను ఎంత ఇబ్బంది పెట్టారో మనకు తెలియనిది కాదు. అదే ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగ 21-6-1991 నుండి 16-6-1996 వరకు సమర్థవంతముగ పాలించి మంచి సంస్కరణలను తెచ్చి దెశాన్ని కష్టాలబారినుండి గట్టెంకిచినప్పుడు తెలుగేతర వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు మనతెలుగువాళ్ళు ప్రత్యేకముగ రెండు తెలంగాణేతర పెద్ద సమాజికవర్గము వారు తెలుగుతనాన్ని గురించి మట్లాడుతారు. ఇది ఎంత హాస్యాస్పదం ప్రాంతీయ పార్టీలు కావొచ్చు, జాతీయ పార్టీలు కావొచ్చు ఆ పార్టీలు ఆ ముఖ్యమంత్రికి సహకరించివుంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న భాషాభిమానానికి అర్థము వుండేది. ఒక ఆంధ్ర రాష్ట్ర అధిపతి ప్రక్కనవున్న తెలుగురాష్ట్ర ము లో జోక్యము చేసుకొని ఆయా రాష్ట్రాల అభివ్రుధిని దెబ్బతేసే విధముగా ప్రవర్తించటము రెండు తెలుగు రాష్ట్రాల క్షేమం కోరినట్లా ! తెలంగాణా రాష్ట్రములో కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఏ రకమైన ఆస్తి పాస్తులు బంధువర్గం లేకపోయిన తెలంగాణరాష్ట్ర అభివ్రుధ్ధిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ రాష్ట్రములో వుండే వారు ఆరాష్ట్ర అభివ్రుధ్ధిని కోరుకుంటూ దేశ క్షేమమును కాంక్షించటము మంచిది . విచిత్రమైన విషయమేమిటంటే తెలంగాణా అభివ్రుధి పనులలో ఏదో వక తప్పు ను ఏరుకొని దానిని భూతద్దము లో చూపించి తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్సిస్తున్నారు. ఆ విధముగ ఎందుకు చేస్తున్నారని అడిగితే మేమూ తెలంగాణా వారిమే నండి మేము ఇక్కడ తప్పుల గురించి మట్లాడ గూడదా అని విగట వాదన చేస్తుంటారు. పైకి చెప్పే దొకటి,ఉధ్ధేశ్యము కోరిక ఇంకొకటి. తెలంగాణా నాయకత్వాన్ని ఈ ప్రాంత పురోభివ్రుధిని కుంటుపరచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తేసుకొనిపోవాలనే ఆలోచనే వారి ధ్యేయం. ప్రింటు మీడియా ,ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఒక సూచన.....ఏ రకమైన చర్చలుగాని, వార్తలు గాని ఆ రాష్ట్రాలకే పరిమితము చేయండి. సమాచారముకోసం కొద్దిగ వ్రాస్తే సరిపోతుంది. అదే పనిగ అక్కడ సగం ఇక్కడ సగం వ్రాస్తూ చర్చలు జరుపుతూ విభెధాలు స్రుష్టించటం హర్షనీయము కాదు. రాష్ట్రాలు రెండుగా విడిపోయినవేమోగని సమాచారసధనాలు నాలుగుగ ఒక చ్చానళ్లొనే విడిపోయినవి. ఇద్దరు అటుప్రక్క, ఇద్దరు ఇటుప్రక్క రెండు అసెంబ్లీలు ఒక చ్చానళ్ళ్లొనే వున్నట్టుగ వున్నవి. తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్ రెండూ వేర్వేరు రాష్ట్రాలు గానే చూడండి. రెండూ తెలుగు రాష్ట్రాలని భ్రమలో పెట్టకండి. తెలంగాణా రాష్ట్ర విశ్లేషణ తెలంగాణ వారితోనే చేయించండి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విశ్లేషణ ఆంధ్రావారితోనే చేయించండి శాస్త్ర పరిజ్ఞానము వున్నవారు దేశము లో ఎక్కడివారైన పరవాలేదు. పేరుకు మాత్రమే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ టి.వి.లు అని ప్రకటించకండి. రెండూ కలిపి ఒకే విశ్లేషణ చేయటము వలన విభేధాలు పెంచుకోవటమే తప్ప సఖ్యత ఏర్పడదు. 
--కందిబండ నరసింహా రావు టి.వి.విశ్లేషకులు, విశ్రాంత అధికారి, కేంద్ర గిడ్డంగుల కార్పోరేషన్,

......... ilantivi meeru gattiga adugutham anagalara meeroche lope ikkada avalsindhi ayipothundhi. Mee video chalabavundhi naaku telangana ravadam istame vadu nanu kottaka mundhu varaku ippudu istame. kaka pothe thittukuntu ista padatham hurt avutharu kadha evarinaaa intha pedda message tho ibbandhi pettinattunanu sorry guru...... poyina pranalatho polchukunte ekkuvemi kadhu kani meelaa vivarinchi maa samasy idhi ante mem thelusukuntam. nenu hyderabad vachinakothalo naa friend andhrodu ra ante palletoorivadu ani antunademo anukune vadni anthe kani dhani venaka inthavundhani theleedhu and okadni ennukunnaka vadiki power vachaka manalni chustada. repu ikkadi govt lo ala avakudadhani korukuntunam all the best.
 ME:-- bro, anta bavundi kaani.. nenu just shre matrame chesa... me bada naaku arthamaindi.. kaani edi me time line post cheste inka bavundedi.. cheer up..
 MY friend:- time line meedhe cheste ippudu nuvu nanu bro antaniki avakasam vundedhi kadhu bhargava naku kuda nuv video share chesevadivi appudu neeku nenu satruvula kanipichevadni ok. any way neeku manchi avakasalu ravali artist ga manchi stage lo vundali bye
 ME:-- my family n my relatives stays at rajamandry, vallu naaku satruvulu emi kaadu... manshi ki manshi eppudu satruvu kaadu... mansulaku matrame satrutwavm undtundi... my best friends from gutur.. my welwisher from vijayawada.. meemu andaram eppatiki alane unnam..future lo kooda alaane untam... abhiprayalu matrame veeru... venela flavor nachavadiki strawberry nachaka povochu.. ikkada problem emitante.. strawberry matrame taste goppadi.. andaru tinede ade.. ante kastam... balavantapu.. ruchulu.. tinalevu... edi ante... any way nice to meet u.. all the best for "U R" future also.. thanks for understand me.... bye.. Chat Conversation End

అట్లతద్దె కు బతుకమ్మ కి సుట్టరికం ఎక్కడిది ?

Districts of Hyderabad State- హైదరాబాద్ రాష్ట్ర మందు ఇచ్చట ఆంద్ర అనెడి శబ్దము / ప్రాంతము అనియు ఏదియును లేదు Hyderabad state in 1909 Administratively, Hyderabad State was made up of sixteen districts, grouped into four divisions: Aurangabad Division included Aurangabad, Beed, Nanded, and Parbhani districts; Gulbarga Division included Bidar District, Gulbarga, Osmanabad, and Raichur District; Gulshanabad Division or Medak Division included Hyderabad (Atraf-i-Baldah), Mahbubnagar district, Medak district, Nalgonda district (Nalgundah), and Nizamabad districts, and Warangal Division included Adilabad, Karimnagar, and Warangal districts. Present Khammam district was part of warangal district.

'ఉర్దూ అనే తీయటి భాష (హింది, పార్సీ, అరబిక్ కలయిక) పుట్టిందే తెలంగాణా లో అంతర్భాగమైన హైదరాబాద్ లో. సిగ్గులేకుండా విమర్షించుకుంటూ, ఈ ఉర్దు నుండి ఎన్ని పదాలు వాడుతున్నరో చూసి సిగ్గు తో తలవంచుకోవాలి. దమ్ముంటే వాటికి తెలుగు లో ప్రతీ పదానికి గల అర్ధం రాయండి. ఆంధ్ర వ్యావహారిక భాషలో ఉర్దూ పదాలు - (1వ భాగం) అజమాయిషి (ఆజ్ మాఇష్), యకాయకీ(యకాయక్), కసాయి (కసాబు), కుమ్మక్కు (కుమక్), కులాసా(ఖులాసా), కుల్లాయి (ఖులాహా), కూపీ (ఖుఫియా), కైపు (కైఫ్ ), ఖాతరు (ఖాతిర్ ), గంజాయి (గాంజా ), గచ్చు ( గచ్-పారసీ), గర్జు (గరజ్), గలభా ( గల్ బా), గలీబు (గిలాఫ్), గసగసాలు (ఖస్ ఖస్), గాభరా (ఘబ్ రాహట్), గిలాబా ( గిలావా), చలాకీ ( చాలాక్ ), చిరునామా (సర్ నామా), చీటి (చిట్టీ), చెకుముకి ( చఖ్ మఖ్), జగడం (ఝగడ్ నా), జంపఖానా (ఝాంప్ నా ), జాగా (జగహ్ ), జాస్తి (జ్యాదతి), జీను (జీన్ ), జులపాలు (జుల్ఫ్), జులాయీ (జులాహా), జులుం (జుల్మ్),జోరు (జోర్ ), తగాదా (తకాజా), తనిఖీ (తనక్కి), తయారు ( తయ్యార్), తరఫు (తరఫ్), తరహా (తరహ్ ), తర్ఫీదు (తర బీయత్), తాపీగా (తాబ్), తాయెత్తు (తావీజు ), తాలూకు (తా అల్లుక్), తాహతు (తాకత్ ), తురాయి (తుర్రహ్ ), త్రాసు (తరాజు), దరఖాస్తు (దర్ ఖ్వాస్త్), దర్యాప్తు(దర్ యాఫ్త్), దళారి (దలాల్), దాఖలా(దాఖిలా), దాణా(దానా), దాల్చిన చెక్క(దార్ చీన్), దినుసు(జిన్స్, బహు వచనం-అజినాశ్), దివాలా(దివాలియా), దుకాణం (దుకాన్), దుశ్శాలువా(దో శాలా), నగదు(నకద్), నాగా(నాకా), నగిషీ(నక్ష్), నమోదు(నమూద్), నాజూకు(నాజుక్), నామోషి(నాముషీ), నిషా(నషా), పకోడి (పకౌడా), పచారి(పన్ సార్), పరకామణి(పరఖ్ నా), పరాయి(పరాయా), పలావు(పులావు), పుదీనా(పోదీనా), పునాది(బునియాద్), పేచీ(పేచ్-చిక్కు), పైజామా(పాయ్ జామా), పొట్లం(పోట్లీ-మూట), ఫరవా(పర్ వా), ఫిర్యాదు(ఫర్ యాద్), బజారు(బాజార్), బకాయీ(బకాయా), బట్వాడా(బట్వారా), బయానా(బేయానా), బాతు(బతక్), బాపతు(బాబత్), బాబు/బాబోయ్(బాప్), బికారి(బిఖారి), బిచాణా(బిఛానా), బినామీ(బేనామీ), బుటా(బూటా), బురుజు(బుర్జ్), భజంత్రీ(బజంత్రి), భీమా(బీమా), భేటీ(భేంట్), మకాం(ముకాం), మజాకా(మజాఖ్), మజూరీ(మజ దూరీ), మద్దతు(మదద్), మలాము(ములమ్మా), మసాలా(మసాలహ్), మాఫీ(ము ఆఫ్), ముక్తసరి(ముఖ్త సర్), మునసబు(మున్సిఫ్), మేడు(మేఖ్), మోస్తరు(మాస్రా), రంగేళి(రంగీలా), రద్దు(రద్ద్), రాయితీ(రి ఆయతీ), రుజువు(రుజూ), రైతు(రయ్యత్), లంగా(లహెంగా), లాలూచీ(లాలచ్), లావాదేవీ(లానా ఔర్ దేనా), లూటీ(లూట్ నా), వగైరా(వగైరహ్), వాకబు(వాకిఫ్), వాయిదా(వాదా), వారసుడు(వారిస్), షరా(శరహ్), షోకు(షౌక్), సంజాయిషీ(సమ్ ఝాయిషీ), సజ్జ(సబ్జా), సజావు(సుఝావ్), సదరు(సదరహ్), సబబు(సబబ్), సబురు(సఫర్), సబ్బు(సాబున్), సరంగు(సర్ హంగ్), సరంజామా(సర్ అంజామ్), సరఫరా(సర్ బరాహి ), సలహా(సలాహ్ ), సాలీనా(సాలానా), సిఫార్సు(సిఫారిష్), సిబ్బంది(సఫ్ బంది), హక్కు(హక్), హమామ్(హమ్మామ్-స్నానశాల), హయాం(అయ్యామ్), హుషారు(హోషియారీ).==== Copied info Telangana facebook page

HE IS the man.. khammam Zilla na..Ko**** gallara... asalu ee projects unnayi ani.. enta kharchu ayindhani... telusaaraa....TELUSKONDI... A Presentation with a VISION and FACTS... am amazed... asalu ee oopulo... prati manadalmlo.. KCR vigraham kadata...


READ MORE ABOUT TELANGANA MOVEMENT
https://en.wikipedia.org/wiki/Telangana



Wednesday, April 10, 2019

తప్పక తెలుసుకోవాల్సినవి...

పదవి కోసం పెన్షన్లు, ఋణ మాఫీలూ, ఉచిత సర్వీసుల ఆఫర్ ద్వారా మన నాయకులు దే శాన్ని మరో వెనిజులా చేస్తున్నారా? వొళ్ళు గగుర్పొడిచే ఈ చరిత్ర చదవండి.

       చిన్న చిన్న సెలయేళ్ళు, నదులు, పచ్చటి ప్రకృతి, సముద్ర తీరాల్లో సమృద్ధి గా ఆయిల్... 1970 లో వెనిజులా ప్రపంచపు 20 ధనిక దేశాల్లో ఒకటి. ఓ నాయకుడు అధికారంలోకి రావటం కోసం ఎన్నికల సమయంలో... ఖాళీగా ఇంట్లో కూర్చున్నవారికీ, బీద కుటుంబాలకీ నెల నెలా ధన సహాయం అని ప్రకటించాడు. గొప్పగా గెలిచాడు. దేశ ఐశ్వర్యం అందరికీ పంచాడు. తరువాతి ఎన్నికల్లో కార్మికుల, ఉద్యోగస్తుల జీతాలు 5 రెట్లు పెంచాడు. సింగిల్ పేరెంట్స్ ఆడవారికి అనూహ్యంగా కానుకలిచ్చాడు. 2008లో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ‘ధర పెరగని రొట్టె ముక్క’ అని ప్రకటించి తిరిగి అధికారం సంపాదించుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన ధరలకి రొట్టెలు, బ్రెడ్, మిగతా నిత్యావసర పదార్ధాలు ఇవ్వలేక చాలా కంపెనీలు మూత పడి పోయాయి.

       More than three million rich industrialists, skilled workers and intelligent students have left the country.

    
ప్రెసిడెంట్ వెనక్కి తగ్గలేదు. దేశంలో ఆయిల్ ద్వారా వస్తూన్న డబ్బు బోలెడు ఉంది. టాయిలెట్ పేపర్ కూడా విదేశాలనుంచి దిగుమతి చేసుకున్నాడు. దేశంలో పని లేదు. హ్యాపిగా తినటం, ప్రభుత్వo ఇచ్చే భ్రుతి తో ఆనందించటం..! ఉచితంగా వచ్చే డబ్బు, సబ్సిడీలకోసం ఎగబడిన జనం రాబోయే సునామీని ఊహించ లేదు. 2005 లో ఆయిల్ ధర పడిపోయింది. దాంతో కరెన్సీ ముద్రణ పెంచాడు. ఎక్కడ చూసినా డబ్బే. పైసా విలువ లేని డబ్బు..! 2018 వచ్చేసరికి ఇన్-ఫ్లేషన్ 13,00,000% అయింది. ఉచిత సబ్సిడీలు ఆగిపోవటంతో దానికి అలవాటు పడ్డ యువకులు కత్తులు, పిస్టళ్లు పట్టుకుని లూటీ చేస్తున్నారు. తిండి లేక జూ లో జంతువులన్నీ చచ్చి పోయాయి. వెనిజుల ముఖ్యపట్టణం పేరు కారకాస్. Carcass అంటే జంతువు కళేబరం. (The dead body of an animal). ప్రతి ఏటా, ఆ నగరంలో ప్రతి లక్షమంది జనాభాలో లో 20 వేలమంది మర్డర్లకి గురి అవుతున్నారు. ప్రపంచంలో పదవ పెద్ద లంచగొండి దేశంగా మారిన వెనిజులా, ప్రస్తుతం ప్రపంచపు అత్యంత ప్రమాదకరమైన రక్తపాత దేశాల లిస్టులో నెంబర్ 1 స్థానంలో ఉంది. టూరిస్టులని ఆదేశానికి వెళ్ళవద్దని మిగతా దేశాలు హెచ్చరిస్తున్నాయి. దిగుమతులకి డబ్బు లేదు. కరెంటు లేదు. నాలుగు రోజులకొక కేవలం గంట నీళ్ళు. షాపుల్లో చివరికి టూత్-పేస్ట్ లేదు. ఉన్నా కొనటానికి డబ్బు లేదు. తినటానికి తిండి లేని వారి సంఖ్య అయిదేళ్ళలో 30 నుంచి 66% కి పెరిగింది. చిన్న రొట్టేముక్క కోసం శరీరo అమ్ముకోవటానికి రాత్రంతా రోడ్ల మీద నిలుచున్న బాలికలు, కాస్త తిండి కోసం తెల్లవారు నుంచి అర్థరాత్రి వరకూ క్యూలో నిలబడే పిల్లలూ, కాలుస్తున్న సగం సిగరెట్ ఇమ్మని రోడ్ల మీద అడుక్కునే పెద్దలు... ఇదీ ప్రస్తుతం ఆ దేశ పరిస్థితి.

సమ సమాజం కావాల్సిందే. కానీ ఉచితం గా ఇవ్వటం ద్వారా కాదు. ఇది నాయకులు తెలుసుకోవాలి. దానికన్నా ముందు ప్రజలు ఆ నాయకులని రిజెక్ట్ చెయ్యాలి. ఈ దేశ ఉదాహరణ గురించి అందరికీ చెప్పండి. 
-- యండమూరి వీరేంద్రనాద్